నల్లదొరల నుంచి ప్రజలని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నారు: డా.పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం విప్లవవీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయనకి జనసేన పార్టీ పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, డా.పసుపులేటి హరిప్రసాద్ పూలమాల వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. తెల్లదొరల డాశోకుల నుంచి భరతమాతకు విముక్తి కలిగించేందుకు ఆనాడు తెల్ల దొరల నుంచి దేశాన్ని కాపాడేందుకు అల్లూరి సీతారామరాజు ప్రాణాలని అర్పిస్తే నేడు నల్లదొరల నుంచి ప్రజలని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పేద ప్రజల కోసం పోరాటం చేయడమే కాకుండా పేద, మధ్యతరగతి ప్రజల కష్టాలని ఎప్పటికప్పుడు గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు లాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఆయన భావాలని పునికిపుచ్చుకొని రాజకీయాలతో పాటు సామాజిక సేవను తన భుజాలకు ఎత్తుకున్నారన్నారు. తన సొంత నిధులతో కౌలు రైతులకు సాయం చేస్తున్నారని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా కార్యదర్శులు, ఆనంద్, బాటసారి, తిరుపతి పట్టణ నాయకులు, లక్ష్మి, కిరణ్ కుమార్, రవి, శిరీషా, దివ్య, పురుషోత్తం, మోహిత్, జనసైనికులు, వీరామహిళలు తదితరులు పాల్గొన్నారు.