జనసేనాని ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన

• ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పరామర్శ…
• రూ.5 లక్షల చెక్కు అందచేత

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20న పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో చౌటుప్పల్, కోదాడల్లో పర్యటనకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శిస్తారు. రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కులు. అందచేస్తారు. 20వ తేదీ ఉదయం 10 గం.కు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో బయలుదేరతారు. మెట్టుగూడ అంటేడ్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం వెళ్తారు. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్పిస్తారు. ఆ తరవాత కోదాడ వెళ్తారు. అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ప్రారంభించింది.