పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఖబర్దార్: పోలిశెట్టి

  • జనసేన నాయకులు పోలిశెట్టి తేజ

మైలవరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద, మరియు ఆయన కాన్వాయ్ వెంట వైసిపి పార్టీకి చెందిన అగంతకుల రెక్కీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ డిమాండ్ చేసారు. పవన్ కళ్యాణ్ జోలికొస్తే రాష్ట్రంలో లక్షలాది జనసైనికులు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే జగన్మోహన్ రెడ్డి దాడి చేయాలని కుట్రలు చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపారని, కేంద్రం ప్రభుత్వం తక్షణమే పవన్ కళ్యాణ్ కి జెడ్ కేటగిరి సెక్యూరిటీని కేటాయించాలి డిమాండ్ చేసారు.