పత్తిపాటి సుబ్రహ్మణ్యం భౌతిక గాయానికి నివాళులర్పించిన పవన్ కళ్యాణ్

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట అసంబ్లీ నియోజకవర్గం నుండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పోటి చేసిన శ్రీమతి పత్తిపాటి కుసుమకుమారి భర్త పత్తిపాటి సుబ్రహ్మణ్యం నాయుడు కొద్ది రోజుల క్రితం నుండి అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ శుక్రవారం రోజున మరణించారు. విషయం తెలుసుకున్న రామ శ్రీనివాస్ రాజంపేట గ్రామీణ ప్రాంతం వారి స్వగ్రామమైన మేకవారి పల్లిలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి అనంతరం రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాన్ మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ పార్టీ శ్రేణులు, జనసైనికులు కలిసి ఆయన మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించి, వారి కుటుంబ సబ్యులను జనసేన పార్టీ ద్వారా పరామర్శించి, అలానే అధినేత పవన్ కళ్యాణ్ తరపున మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడపజిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కత్తిసుబ్బరాయుడు, పలుకూరి శంకర్, అబ్బిగారి గోపాల్, లతీఫ్, ఊటుకూరు శివ, పుల్లంపేట నుండి శింగనమల రామమూర్తి, ఇతర నాయకులు, జనసైనికులు, అక్కడి స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.