పవన్ కళ్యాణ్ కి జడ్ కేటగిరి సెక్యూరిటీ తక్షణం ఏర్పాటు చేయాలి: బాలచందర్ నాయుడు

కందుకూరు, జనసేనపార్టీ పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని 250 కోట్లు భారీ సుపారి చేతులు మారినట్లు కేంద్ర నిఘా వర్గాలకు ఆధారాలు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్ని రెక్కీలు నిర్వహించినా మా దేవుడు పవన్ కళ్యాణ్ ని ఏం చేయలేరు. మా అధినేతకు మా జనసైనికులు, వీరమహిళలు రక్షణ కవచంలా ఉంటాం. బాబాయిని చంపినంత సులభం కాదని, జనసేన పార్టీ కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండల నాయకులు బాలచందర్ నాయుడు హెచ్చరించారు. త్వరగా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే జడ్ కేటగిరి సెక్యురిటీని ఏర్పాటు చెయ్యాలని చెప్పారు. లేదంటే రెండు తెలుగు రాష్ట్రాలు, అట్టుడికిపోతాయని హెచ్చరించారు.