పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసైనికుల ప్రత్యేక పూజలు
- అన్నదానానికి క్వింటా బియ్యం అందజేత
ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ దశరా శరన్నవరాత్రుల సందర్భంగా జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో ఉన్న శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో మంగళవారం జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు, పసుపులేటి చిరంజీవి, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు పుప్పాల పాపారావు, అంకిరెడ్డి, ఉప్పు అంజి, ఉల్లి వెంకట్ మారబత్తిని వెంకటయ్య మరియు జనసేన పార్టీ వీర మహిళలు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్కు ఆయురారోగ్యాలు కలగాలని, భవిష్యత్తులో ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున క్వింటా బియ్యం అందజేశారు. కార్యక్రమంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-17.53.29-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-17.53.28-1024x576.jpeg)