పవన్ కళ్యాణ్ పిలుపు – సైకిల్ గెలుపు

బొబ్బిలి నియోజకవర్గం: ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన మరియు ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుల గెలుపు కోసం, మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి గుడిలో ఆశీర్వాదం తీసుకొని సైకిల్ గుర్తును ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకోని వెళ్లేలా సైకిళ్ళ పర్యటన ప్రారంభించారు. 5,7,8,9 వార్డులోని అన్ని వీధులలో మన బొబ్బిలి అభివృద్ధి కోసం, సైకిల్ గుర్తుకు ఓటేయండి అంటూ ప్రజలను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఎన్డీఏ కూటమి శ్రేణులందరూ పాల్గొనడం జరిగింది.