కన్నడ రాజ్య దినోత్సవం సందర్భంగా మొక్కల పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు

కర్ణాటకలో చిక్బల్లాపూర్ డిస్టిక్ సిడ్లగట్ట తాలూకాలో 67వ కన్నడ రాజ్య దినోత్సవం సందర్భంగా అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కన్నడ రాజోత్సవం సందర్భంగా 1000 మొక్కల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత , చిక్కబళ్లాపుర జిల్లా అధ్యక్షులు అప్పల హరీష్, షడ్లగట్ట అధ్యక్షులు బుజ్జి నాయక్, చింతామణి అధ్యక్షులు, గజేంద్ర నాయక్, కోలార జిల్లా ఉపాధ్యక్షులు హరీష్, రాజ్యసమితి గౌరవ అధ్యక్షులు మంజునాథ్, రాజ్యసమితి గని అఖిల కర్ణాటక చిరంజీవి యువత షీట్ల గౌరవాధ్యక్షులు దినేష్ బాబు శ్రీనివాస్ చౌడు సంద్ర పాల్గొన్నారు. అతిదులకు పవన్ కళ్యాణ్ గారి ఫొటో ఫ్రేమ్స్ అందించిన సంఘ అధ్యక్షులు సంఘ సభ్యులందరికి దన్యవాదాలు చెప్పారు.