వైసీపీ సర్కార్ పై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ !
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్..జగన్ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వైసీపీ మంత్రులు మరియు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. అయితే. పవన్ చేసిన వ్యాఖ్యలకు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు వైసీపీ మంత్రులు. కాగా. తాజాగా వైసీపీ సర్కార్ పై వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
వైసిపి పార్టీ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరియు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మద్యపాన నిషేధం, కరెంటు చార్జీలు, ఉద్యోగాల భర్తీ మరియు రాజధాని అంశం ఇలా ఎన్నో వాగ్దానాలను వైసీపీ పార్టీ ఇచ్చిందని. కానీ వాటిలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. అంతేకాదు వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి.. నెట్టిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
#SaveAPfromYSRCP
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
వైసిపి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు – వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు. pic.twitter.com/hq34M15Dx0