త్రిపురాంతకంలో వారాహి పూజలో నేరెళ్ల సురేష్

గుంటూరు: జనసేన గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో త్రిపురాంతకంలో వేంచేసి ఉన్న వారాహి అమ్మ వారికి వారాహి యాత్ర విజయవంతంగా జరగాలని ఏ దుష్ట శక్తులు, శాడిస్టులు సైకోల దిష్టి పడకూడదని, అంతా మంచి జరగాలని వారాహి అమ్మవారికి అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింత రేణుక రాజు, సూరిశెట్టి ఉదయ్, రత్తయ్య, రవీంద్ర బండారు, పుల్లం శెట్టి ఉదయ్, కోటేశ్వరరావు పావులూరి, సుధా నాగరాజు, తోట కార్తీక్, నాగరాజు మిద్దె, పులిగడ్డ గోపి, నవీన్, నగర కమిటీ సభ్యులు మరియు జనసేన శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.