జనసైనికులను ఆర్దికంగా ఆదుకోన్నందుకు స్పెషల్ థాంక్స్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతూ చిత్తూరు జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మెగా ఫ్యామిలీ సహా పవన్ కళ్యాణ్ చిత్ర నిర్మాతలు కూడా సహాయం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుతూ ఒక ట్వీట్ చేసారు.

కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాం చరణ్ కి, అలాగే పెద్ద మనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి,నిర్మాతలు – శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.