పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం 32వ రోజు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం 32వ రోజు మంగళవారం పర్యటన వేటపాలెం మండలం, దేశాయిపేట పంచాయతీ పరిధిలో రామా నగర్ కాలనీలో కర్ణ కిరణ్ తేజ్ అధ్వర్యంలో పూర్తి అయ్యింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు వరం బూడిద (చేనేతపురి), తోట చక్రి (కడవకుదురు- పర్చూరు నియోజకవర్గం) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది చేనేతలకు సొంత గృహాలు లేక అద్దె గృహాల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్నారని అదేవిదంగా వయో వృద్దులకు ప్రభుత్వ పెన్షన్లు రావడం లేదు అని గుర్తించడం జరిగింది. వీటి పరిష్కారం కోరకు నియోజకవర్గ సీనియర్ నాయకుల సహకారంతో సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈ చేనేత కార్మికులందరికీ నివాస గృహాలు, పెన్షన్లు అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది.