77వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట

  • 32వ వార్డులో డాక్టర్ కందుల పర్యటన
  • మృతుని కుటుంబానికి చేయూత
  • అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

విశాఖ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం మంగళవారం నాటికి 77వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 32వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తారకరామ కాలనీలో మృతి చెందిన నూకరాజు కుటుంబానికి అండగా నిలిచారు. అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. సేవే దైవంగా భావించి తాను పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. సుమారుగా తను చేసే సేవా కార్యక్రమాలను తన సొంత నిధులతోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో తన కార్యక్రమాలను మరింతగా విస్తరించినట్లు వెల్లడించారు. జనసేన పార్టీ ఆదేశాలతో మరిన్ని కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చేది జనసేన ప్రభుత్వమేనని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గణేష్, సాయి, మంగ, దుర్గ, కుమారి తదితరులు పాల్గొన్నారు.