పవనన్న ప్రజాబాట.. ప్రజల్లోకి దూసుకెళ్తున్న రాజంపేట జనసేన

రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట 35వ రోజు కార్యక్రమంలో బాగంగా ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరం పంచాయతీలో తిరిగి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉండే ప్రజలు జగన్ చేసే అరాచకాలకు పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు బండి లక్ష్మీదేవి, సునీత, ప్రియాంక, లక్ష్మీదేవి, మల్లేశ్వరి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొనడం జరిగినది.