నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట

నిడదవోలు: ఉండ్రాజవరం మండలం, మోర్త గ్రామంలో శుక్రవారం పవనన్న ప్రజాబాట కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ముత్యాల ప్రియా సౌజన్య మరియు ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు పేరుమల్ల బాలాజీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సాదా వెంకటేష్, ఎంపీటీసీ కాకర్ల కరుణ, మరియు ఇంద్ర గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వినయ్, మండల కార్యదర్శి సుబ్బు, నిడదవోలు టౌన్ నాయకులు రంగా రమేష్, పందలపర్రు గ్రామ అధ్యక్షులు కర్రి వినోద్ కుమార్, నిడదవోలు మండల జనసేన నాయకులు, ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొన్న మోర్త గ్రామ జనసైనికులకు పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసారు.