ప్రజల ఆశీర్వాదంతో పవనన్న ప్రజాబాట

  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట, ఒంటిమిట్ట పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో రాజంపేట ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నేడు 46వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఒంటిమిట్ట మండలంలోని మలకాటపల్లె, సాలబాదు పంచాయతీలోని పలు గ్రామాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, పవనన్న ప్రజా బాట కార్యక్రమం సాగుతుంది. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈసందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య భరోసా ఇవ్వడం జరిగింది. మన కష్టాలు తొలగి పోవాలంటే ప్రజలందరూ, జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా రాటాల రామయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.