‘వీర’ పాత్ర లో కనిపించనున్న పవన్ కొత్తసినిమా
‘వకీల్సాబ్’ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కాల్సి ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్పైకి వెళ్ళాల్సి ఉండగా కరోనా కారణంగా పవన్ ప్రస్తుతం చేస్తున్న ‘వకీల్సాబ్’ షూటింగ్ ఇంత వరకు పూర్తి కాలేదు. ఈ సినిమాకు సంబంధించి పవన్, ఇంకా హీరోయిన్ మధ్య చిత్రికరించాల్సిన కొన్ని సీన్లు ఉన్నాయని తెలుస్తుంది. రీసెంట్గా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నానని శృతిహాసన్ కన్ఫర్మ్ చేసింది. శృతిహాసన్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి.. కాస్త కరోనా ఉదృతి తగ్గగానే బ్యాలెన్స్ షూట్ని పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
ఇక ఈ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్కు సంబంధించిన చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సెట్స్ వర్క్ జరుగుతోంది. అన్నీ క్లియర్ అవ్వగానే షూట్ స్టార్ట్ చేసి శరవేగంగా క్రిష్ ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడట. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ‘వీర’గా కనిపించనున్నారట. అందుకే ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా కూడా టాక్. ఈ చిత్రం మహబూబ్ నగర్కి చెందిన పండగల సాయన్న స్టోరీ అని అంటున్నారు.