క్రియాశీలక సభ్యునికి భరోసా ఇచ్చిన పాయకరావుపేట జనసేన
పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్ రాయవరం మండలం భీమవరం గ్రామంలో క్రియాశీలక సభ్యుడు మాడాగల ప్రసాద్ కి ఒక నెలముందు జరిగిన బైక్ ప్రమాదం వలన కాలుకి 3 ఆపరేషన్లు జరిగాయి. ఈ విషయం తెలుసుకొని భీమవరంలో జనసైనికులు వెళ్లి ధైర్యం చెప్పి త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన కోసం ప్రవేశపెటిన క్రియాశీలక సభ్యత్వానికి కావలసిన పత్రాలు అన్నీ సమర్పించడం జరిగిందని అందువలన త్వరలో చెక్ అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి బాలకృష్ణ, భేశెట్టి సతీష్, థకాసి కిషోర్, మాడాగల రాజు, జంపా దొరబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-12-at-18.01.14-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-12-at-18.01.17-576x1024.jpeg)