ముంబై పోలీసుల తీరుపై ఘాటుగా స్పందించిన పాయల్ ఘోష్..

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనుర్యాగ్ కశ్యాప్ తనపై లైంగిక దాడికి దిగాడంటూ నటి పాయల్ ఘోష్ అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో పలువురు పాయల్‌కు మద్ధతు నిలువగా అనూహ్యంగా మరికొందరు అనురాగ్‌కు అండగా నిలిచారు. ఈ విషయమై పాయల్ ముంబై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసి మూడు నెలలు గడుస్తోన్నా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాయల్ ఘాటూగా స్పందించారు.

ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన పాయల్.. ‘నేను అనురాగ్‌పై ఫిర్యాదు చేసి నాలుగు నెలలు గడుస్తోన్నా పోలీసులు ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు విచారణ సరిగ్గా చేయడం లేదు. మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా, ఇది ఓ మహిళకు సంబంధించిన విషయం. దీని ద్వారా సమాజానికి ఏం చేప్పాలనుకుంటున్నారు’ అంటూ పాయల్ ట్వీట్ చేశారు.

బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లినవారిని ఆదుకోవల్సిన అవసరముందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీ రామారావు అన్నారు.