పెన్షన్ దారులకు పెన్షన్లు అందజేత

కేశవదాసుపాలెం గ్రామంలో ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న అంగవైకల్యం కారణంచే ఇబ్బందులు పడుతున్న వారికి, వృద్దులకు, వితంతువులకు కలిపి వచ్చిన 39 కొత్త పెన్షన్ దారులకు పెన్షన్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిది సరోజ భరత్, ఎంపీటీసీ ఉండపల్లి సాయి కుమార్ అంజి, వి.ఆర్.ఓ నాగరాజు, వెల్ఫేర్ ప్రమోద్, అడ్మిన్ దర్మేష్, పెన్షన్ దారులు సచివాలయం, పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.