ప్రమాదానికి గురైన కళాకారులకు అండగా నిలబడిన పేడాడ రామ్మోహన్ రావు

శ్రీకాకుళం: శ్రీకాకుళంలో డాన్స్ ప్రోగ్రాం ముగించుకొని వైజాగ్ తిరిగి వస్తున్నసమయంలో ఇద్దరు కళాకారులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో కళాకారుడు వేణు స్పాట్లో మృతి చెందాడు, కళాకారిణి తిలోత్తమ గాయలపాలవ్వగా.. జనసైనికులు లుక్స్ గణేష్, అర్జున్ ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు ఆమదాలవలస ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఘటనా స్థలానికి వెళ్లి.. అక్కడ పోలీస్ వారితో మాట్లాడి గాయలపాలైన తిలోత్తమను పరామర్శించి.. వేణు పోస్టుమార్టం దగ్గర ఉండి జరిపించి.. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఓదార్చారు.