ఆవిర్భావ సభా ప్రాంగణంలో స్వచ్ఛభారత్ చేపట్టిన పేడాడ రామ్మోహన్ రావు

పిఠాపురం, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న పిఠాపురంలో జరిగిన బహిరంగ సభ విజయవంతంగా ముగిసిన అనంతరం గ్రౌండ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడుగా బాధ్యతలు నిర్వహిస్తూ శనివారం సభా ప్రాంగణంలో ఉన్న వ్యర్థాలను మరియు చెత్తను సేకరిస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టిన ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా మిగతా కార్యవర్గ సభ్యులను మరియు అందుబాటులో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు, జనసైనికులకు కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా పాల్గొని జనసేన పార్టీ పట్ల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పట్ల క్రమశిక్షణ కలిగిన పార్టీ సభ్యులుగా ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

Share this content:

Post Comment