“రైతు భరోసా యాత్ర” టీం పిడికిలి పోస్టర్ ను ఆవిష్కరించిన పెడన జనసేన

పెడన, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి 30 కోట్ల ఆర్థిక సహాయం అందజేయనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూడు వేల మంది రైతులకు సహాయం అందించబోతున్నారు. జనసేనాని చేస్తున్న రైతు భరోసా యాత్ర టీం పిడికిలి పోస్టర్ను పెడన నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు గురువారం ఆవిష్కరించారు. కౌలు రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో తెలుగువారి నూతన సంవత్సర ఉగాది రోజున పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారని ప్రకటించడం రాష్ట్ర రైతుల పట్ల, వ్యవసాయం పట్ల పవన్ కళ్యాణ్ కి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఇప్పటివరకు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులనె చూసాం. తన కష్టార్జితంతో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలనె ఉద్దేశంతో ఎంతో ఉదార స్వభావంతో ముందుకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వ్యవసాయ రంగం కుదేలైంది. వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాదు. ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేసిన సకాలంలో డబ్బు చెల్లించని పరిస్థితి. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేయబడింది. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. కౌలు కార్డుల జారీలో తీవ్ర జాప్యం. తద్వారా కౌలు రైతులు పంట అమ్ముకోవాలి అన్న, బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్న, పంట నష్టపరిహారాన్ని పొందాలన్న పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగానికి జీవం పోయాలి అన్న, రైతు కళ్లల్లో ఆనందం చూడాలన్నా అది పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం. చేయి చేయి కలుపుదాం పవన్ అన్న తో పయనిద్దాం. ఈ కార్యక్రమంలో ఎస్ వి బాబు, బత్తిన హరి రామ్, కూనసాని నాగబాబు, పండమనేని శ్రీనివాస్, ర్యాలీ సత్యనారాయణ, పుప్పాల పాండురంగారావు, జన్యువుల నాగబాబు, కొప్పి నీటి శివమణి, పుల్లేటి దుర్గారావు, చీర్ల నవీన్ కృష్ణ, జోగి రవీంద్రబాబు, కూనపరెడ్డి రంగయ్య, బత్తిన రమేష్, బత్తిని నరేష్, శిరం సంతోష్, వాసన కుమారస్వామి, కనపర్తి వెంకన్న, బోయన నరేంద్ర, పినిశెట్టి రాజు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.