బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పెద్దమండ్యం జనసేన వినతి

తంబళ్లపల్లి నియోజకవర్గం, మదనపల్లి నుండి గాలివీడు ప్రధాన రహదారి పెద్దమండ్యం మండలం సంతగేటు దగ్గర కుశవతి నది చిన్నపాటి వర్షం పడినా వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు రాకపోకలు ఇబ్బంది పడుతున్నారు. పైగా విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారింది ఈ రహదారి హైస్కూల్ మోడల్ స్కూల్ కూడా అక్కడే ఉన్నాయి. గతంలో వరద ప్రవాహానికి వాహనాలు కూడా కొట్టుకుపోయాయి, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారని ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పెద్దమండ్యం మండల జనసేన పార్టీ నాయకులు కమిటీ సభ్యులు ఈ సమస్యను జనవాణి ద్వారా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దమండ్యం నాయకులు, కమిటీ సభ్యులు శంకర, ప్రకాష్ రెడ్డి, భీమయ్య, వేణు, రెడ్డప్ప, శంకరయ్య, చరణ్ తదితరులు పాల్గొన్నారు.