సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాల్ గోడప్రతులను ఆవిష్కరించిన పెనమలూరు జనసేన

కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గంలో సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాల్..! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఇస్తున్న వారిలో ఒక్కరిని అయినా రైతు కాదు అని నిరూపించే దమ్ము వైసీపీ కి ఉందా..? అంటూ టీం పిడికిలి వారు రూపొందించిన పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది మరియు ఆటోలకి, గోడలకి అతికించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.