తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు పెనుకొండ జనసేన మద్దతు

పెనుకొండ నియోజకవర్గం: తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి నిరసనగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం సూధన్ రెడ్డి ఆదేశాలు మేరకు జనసేన పార్టీ పెనుకొండ నియోజకవర్గం తరుపున నియోజకవర్గం నాయకులు కుమార్ ఆధ్వర్యంలో శాంతియుతంగా పాల్గొని మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుకొండ మండల కన్వీనర్ మహేష్ టౌన్ కన్వీనర్, లోకేష్ నాయకులు రాజేష్, బంగారం, మంజునాథ్, సురేష్, హరి నాయక్, నరేష్, హరీష్, ప్రదీప్, ప్రసాద్, రమేష్, వెంకట్, తిరుపతి, రామంజి తదితరులు పాల్గొన్నారు.