స్వాతంత్ర్య సమరయోధునికి నివాళులర్పించిన పెనుమంట్ర జనసేన

ఆచంట, దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం సాగించిన సంఘ సంస్కర్త, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర స్ఫూర్తిదాయకం ఆ మహనీయుడి జయంతి సందర్బంగా బుధవారం పెనుమంట్ర మండలం, పెనుమంట్ర గ్రామంలో జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు షేక్ మహ్మద్ ఆలీ, మండల ప్రధాన కార్యదర్శి బొనం నరసింహమూర్తి, కార్యదర్శి వరికూటి చిరంజీవి, కార్యదర్శి ఆకేటి నాగ శ్రీహరి, పెనుమంట్ర గ్రామ జనసేన నాయకులు జవ్వాది సురేష్, గంట చిట్టిబాబు, నెలమూరు గ్రామ అధ్యక్షులు నాగరాజు, అప్పల నరసింహరాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.