వైసీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం
- పవన్ కళ్యాణ్ చెప్పింది చిలక జోస్యం కాదు ప్రజా జోస్యం
- సానుభూతి కోసం కుటుంబ సభ్యులను బలి తీసుకున్న చరిత్ర వైసిపిది
- జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య
రాజమేట, సిద్ధవటం, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక, అవినీతి, అసమర్థత పాలనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న వైసీపీ నేతలు సంస్కార హీనుల్లా వ్యక్తిగత విమర్శలకు దిగటం సిగ్గుచేటని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ, వైసిపి అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.పేర్ని నాని మంత్రిగా విఫలమయ్యాడని రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మాని పరిపాలనపై దృష్టి పెట్టండి అని రామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-22-at-17.02.18-1024x632.jpeg)