వరికూటి నాగరాజుని సత్కరించిన కురిచేడు మండల జనసైనికులు

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు, ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజుని వారి కార్యాలయంలో కలిసి శాలువాతో సత్కరించిన కురిచేడు మండల జనసైనికులు. అనంతరం వారు కురిచేడు మండలంలో ప్రతిపక్షం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా దానికి వరికూటి నాగరాజు స్పందిస్తూ దర్శి నియోజకవర్గంలో జనసేనలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ వారి దగ్గరికి వచ్చిన జనసైనికులకు భరోసాను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పత్తి శ్రీరంగ, వీర మహిళ లక్ష్మీ, పాశం వెంకటేష్, పిక్కిలి ఏడుకొండలు, వేమా రమణయ్య, శెట్టిపల్లి బాలు, పెనుగొండ నరసింహారెడ్డి, పట్టి కోటేశ్వరరావులు పాల్గొనడం జరిగినది.