ప్రజలే స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు: బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో ‘జనం కోసం జనసేన మహా పాదయాత్ర’ 42 వ రోజు భాగంగా ప్రజలతో ఈరోజు ప్రజలతో మమేకమవుతూ జనసేన విధివిధానాలను వివరిస్తూ ముందుకు సాగుతూ ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఈ కార్యక్రమంలో ప్రజల స్వచ్ఛందంగా ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తామని, వెంకటలక్ష్మి కి హారతులు పట్టడం విశేషం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మెడిశెట్టి శివరాం, అడబాల అదివిష్ణు, భూపాలపట్నం సర్పంచ్ గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, నల్లా దుర్గాప్రసాద్ ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.