పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలి: నరసాపురం కూటమి నాయకులు

నరసాపురం, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, శనివారం ప్రభుత్వ విప్ మరియు నరసాపురం నియోజకవర్గ శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సలహాదారులు, మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్, మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, తెలుగుదేశం పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు మరియు జనసేన నాయకులు బొమ్మిడి సునీల్ ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శనివారం నరసాపురం నియోజకవర్గంలోని ఉమెన్స్ కాలేజ్, జే బీరా స్కూల్, రుస్తుంబాద్ పంచాయతీ, స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో పలుచోట్ల ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1 వ ప్రాధాన్యత ఓటు పేరా బత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ అబ్జర్వర్ సూర్యనారాయణ రాజు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పులపర్తి వెంకటేశ్వరరావు, జనసేన టిడిపి మండల అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్, వాతడి ఉమా, జక్కం శ్రీమన్నారాయణ వలవల నాని బందెల రవీంద్ర భారతి, నిప్పులేటి తారక రామారావు, శంకు భాస్కర్ నాయుడు, లక్కు బాబి, గ్రంధి నాని, పొన్నమండ సత్యనారాయణ జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment