వ్యక్తిగత దూషణ మాని మీకు కేటాయించిన శాఖల అభివృద్ధిపై దృష్టి పెట్టండి: దారం అనిత

రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు తనకు కేటాయించిన శాఖలకు ముందు న్యాయం చేయండి గుడివాడ అమర్నాథ్ గారు మీకు కేటాయించిన శాఖ ఐటి మరియు పరిశ్రమలు, అంబటి రాంబాబు గారు మీకు కేటాయించిన శాఖ జలవనరుల శాఖ మీ శాఖకు న్యాయం చేయకపోగా.. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి స్పందించకపోతే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడం అనేది జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. చేతనైతే కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోండి. మీ ప్రాంతాలలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, మీరు ఎన్ని కుటుంబాలను పరామర్శించారు, ఎంత మందికి సహాయం చేశారు. తన సొంత సంపాదనలో ఐదు కోట్ల రూపాయలు కౌలు రైతుల కుటుంబాలకు కేటాయించి కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు సహాయం చేస్తూ ఉంటే.. ఓర్వలేని మీరు ఈ విధమైన నీచమైన రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, ధరల నియంత్రణ లేదు, పరిశ్రమలు లేవు, నవరత్నాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, వాటి మీద దృష్టి సారించి ప్రజలకు మంచి పరిపాలన ఏ విధంగా అందించాలో ప్రయత్నాలు చేయాల్సిందిగా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత తెలియజేసారు.