బస్సు సర్వీస్ ల కొరకు జనసేన నాయకుల వినతి పత్రం

ముట్లూరు గ్రామం నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది విద్యార్థులు, ప్రజలు ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఆ బస్సుల సర్వీస్ లను ఇటీవల కాలంలో తగ్గించడం వలన మరియు ప్రస్తుతం నడిచే బస్సులు సకాలంలో నడవకపోవటం వలన విద్యార్థులు, గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిగణనలోనికి తీసుకుని బస్సు సర్వీస్ లు పెంచి సకాలంలో బస్సులు నడిచేవిధంగా అధికారులను ఆదేశించవాల్సినదిగా బుధవారం గుంటూరు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ని కలిసి వినతి పత్రం అందించిన ముట్లూరు గ్రామ జనసేన పార్టీ నాయకులు.