నారా లోకేష్ కు రజక సమస్యలపై వినతి పత్రము

రాజోలు: బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం జరిగిన యువగళం పాదయాత్రలో భాగంగా మామిడికుదురు మండలంలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు రజక సంఘం అధ్యక్షులు కోటిపల్లి సాయిబాబు ఆధ్వర్యంలో రజక సమస్యలపై వినతి పత్రము ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, ఉపాధ్యక్షులు గుడిమెల్లంక కాశి, జనసేన పార్టీ మామిడికుదురు మండల కార్యదర్శి కాట్రేనిపాడు నాగేంద్ర, మామిడికుదురు సంఘం అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, అదికారపు వీరన్న పేట భాస్కర్ రావు కాట్రేనిపాడు పెద్దిరాజు రజక సంఘం సోదరులు పాల్గొన్నారు.