భోగిరెడ్డి గంగాధర్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం

కాకినాడ రూరల్, విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర పిఏసి సభ్యులు పంతం నానాజీ మరియు ఇతర రాష్ట్ర నాయకులు, ఇంచార్జ్ ల పిన పెట్టిన కేసులు కొట్టివేయాలని, అక్రమంగా అరెస్టులు చేసిన వారిని బేషరుతుగా విడుదల చేయాలని కోరుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, కరపలో సీనియర్ జనసేన నాయకులు బోగిరెడ్డి కొండబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టి పోలీస్ మరియు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప మండల నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.