వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ భార్యా పిల్లల ఫోటోలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య ‘అన్నా లెజ్‌నేవా’ క్రిస్మస్ వేడుకల కోసం కొద్ది రోజుల ముందు రష్యాకు వెళ్లారు. అయితే క్రిస్మస్ పండగ ఇంకా అవ్వకముందే కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ లతో కలసి అన్నా లెజ్‌నేవా హైదరాబాద్ కు తిరిగి చేరుకున్నారు. అన్నా లెజ్‌నేవా షార్ట్ హెయిర్ కట్ తో, అలాగే పవన్ పిల్లలు చాలా క్యూట్ గా కనిపించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్నా లెజ్ నేవా మరియు మార్క్ శంకర్ పవనోవా – పొలెనా అంజనా పవనోవా సంబంధించిన ఎయిర్ పోర్టులో కనిపించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. చాలా రోజుల తర్వాత పవన్ భార్య కెమెరా కంటికి చిక్కడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు చీరకట్టులో కనిపించిన అన్నా.. తాజాగా జీన్స్ మరియు టీషర్టులో ట్రెండీగా కనిపించారు.

నిజానికి ఈ వేషాధారణలో ఆమెను చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి అన్నా ముఖానికి మాస్కు ధరించి ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్నారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ భార్యా పిల్లలు కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.