పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలంలోని పలువురిని పరామర్శించారు. వేట్లపాలెం గ్రామంలో ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న కడలి వీర వెంకట సత్యనారాయణ మూర్తి(పెద్ద అబ్బులు)ను పరామర్శించారు. మాతృ వియోగంతో బాధపడుతున్న జిల్లెల్ల వారి పేట గ్రామానికి చెందిన ఇళ్ళ యేసు ను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన గిడ్డివారి పేట గ్రామానికి చెందిన తానింకి వెంకటస్వామి మరియు గిడ్డి వెంకన్న కుటుబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, జక్కంసెట్టి పండు, మోకా బల ప్రసాద్, దూడల స్వామి, మాదాల శ్రీధర్, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, గిడ్డి రత్న శ్రీ తదితరులు పాల్గొన్నారు.