మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రమిచ్చిన పిడుగురాళ్ల జనసేన

గురజాల, పిడుగురాళ్ల పట్టణంలోని 4వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో మరియు ప్రజాశక్తి నగర్ నందు బజారు మధ్యలో ఉన్నటువంటి కాల్వల మీద కల్వర్టుగాని కనీసం ధోనె కానీ ఏర్పాటు చేయకపోవడం వలన ఆ రోడ్లో ద్విచక్ర వాహనం కూడా పోయే పరిస్థితి లేదని, అదేవిధంగా ప్రజాశక్తి నగర్ లోని మొదటి లైన్ లో బోరింగ్ పంపు రిపేర్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా పట్టించుకునే నాధుడు లేడని, అంబేద్కర్ కాలనీలోని చర్చి లైన్ లో విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎమ్మార్వో ఆఫీస్ వెనుక బజారు నుంచి అంబేద్కర్ కాలనీలోకి కలిసే 50 అడుగుల సిమెంట్ రోడ్డు వేయలేదని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి, అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసీం సైదా, మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ కి తెలియచేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అక్కడ పరిస్థితిని చూసి ఇక్కడ ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని, కొన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పుకునే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ల పట్టణంలోని 4వ వార్డు కి వచ్చి చూస్తే మీ అభివృద్ది ఏంటో అర్ధమవుతుంది అని, చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు, ప్రజలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనీసం చిన్న చిన్న సమస్యలు అయినా వెంటనే పరిష్కరించాలని అన్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాశీం సైదా, మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు పెదకొలిమి కిరణ్, బయ్యవరపు రమేష్, గుర్రం కోటేశ్వరావు, దూదేకుల కాసిం, నాగుల్ మీరా, సామెల్, సాగర్, బాషా, మీసాల రాజేష్, కామిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.