పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

రాష్ట్ర జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం, టీ కొత్తపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన కునుపు అమ్మోజి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామానికి చెందిన అనారోగ్యంతో మరణించిన వడగన చిన్న వీరభద్ర రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట మండల అధ్యక్షులు మద్ది శెట్టి పురుషోత్తం, సవరపు ప్రసాద్, నరాల రాంబాబు, ఏసుబాబు, సవరపు వెంకట్, గంజ యేసు బాబు, వాసంశెట్టి బాజీ, దూడల స్వామి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.