అంబేద్కర్ కు నివాళులు అర్పించిన పితాని బాలకృష్ణ

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరించి నివాళులు అర్పించిన జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, అనంతరం ముమ్మిడివరం కాశివారి తూము సెంటర్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. వీరితోపాటు మోకా బాల ప్రసాద్, దూడల స్వామి, గుద్దటి విజయ్, మాదాల శ్రీధర్, పాయసం సాయి, మట్టపర్తి శంకర్, పితాని రాజు, పితాని శివ, విత్తనాల రవి తేజ, బొక్కా శ్రీను మొదలగు వారు ఉన్నారు.