అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం అడవిపేట పేట గ్రామంలో జరుగుచున్న అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు. ఆయన వెంట మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్, పిల్లి గోపి, ఓగూరి భగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, వజ్రపు చిరంజీవి, నందికి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.