పితాని ఆధ్వర్యంలో ఓటు నమోదు ప్రక్రియ శిక్షణ కార్యక్రమం

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర జనసేన పార్టీ నియమించిన ఐటీ విభాగం జిల్లా ఐటి కోఆర్డినేటర్ గాలిదేవర తామేష్, ముమ్మిడివరం నియోజకవర్గ ఐటీ నందిగోల్ల సత్య ప్రకాష్ పర్యవేక్షణలో ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయం నందు ఓటు నమోదు ప్రక్రియ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఓటు నమోదు ఎలా చేయాలో స్క్రీన్ పై వివరించి చెప్పడం జరిగింది. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 తేదీన రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వర్తించాలో అన్న విషయం గురించి పార్టీ శ్రేణులతో బాలకృష్ణ చర్చించారు. అనంతరం కాట్రేనికోన మండల వీరమహిళ గిడ్డి రత్నశ్రీ వారి మాతృమూర్తి అకాల మరణం చెందడంతో చింతిస్తూ వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.