దేవి నవరాత్రుల అన్నసమారాధనలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం గేదేల్లంక గ్రామంలో రావి చెట్టు సెంటర్ వద్ద దుర్గమ్మ వారి అన్నసమారాధన కార్యక్రమం, ముమ్మిడివరం నగరపంచాయితీ క్రాపచింతలపూడి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమం మరియు ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో జనసేన నాయకులు మునికోటి జాజి ఏర్పాటు చేసిన సత్తెమ్మ తల్లి అమ్మవారి భోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గుద్దటి జమ్మి, జక్కంశెట్టి పండు, కడలి కొండ, మాదాల శ్రీధర్, మాదాల వంశీ, చింతలపూడి అజయ్ తదితరులు పాల్గొన్నారు.