పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామానికి చెందిన ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన కోన సత్తిబాబు కుమారుడు మహిమ కిరణ్ ను పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో ఇంటి దగ్గర కోరుకుంటున్న గేదెల్లంక గ్రామానికి చెందిన పేరాబత్తుల రామకృష్ణ భార్య మంగతాయారమ్మను పరామర్శించారు. అలాగే గేదెల్లంక గ్రామానికి చెందిన గుద్దటి కాశీ విశ్వనాథం, ఇటీవల అకాల మరణం చెందియున్నారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఇటీవల మరణించిన బొంతు సుబ్బాయమ్మ పెద్దకార్యంలో పాల్గొని వారి కుమారులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, గుద్దటి విజయ్, సానబోయిన వీరభద్రరావు, పితాని రాజు, నిమ్మన శ్రీను, మామిడిపల్లి సాయిబాబు, కోన వెంకటేశ్వరరావు, కోన బాబ్జి, గుద్దటి శ్రీను, ఒంటెద్దు దుర్గారావు, కడలి నాగేశ్వరరావు, బొంతు వీరబాబు, బొంతు సత్తిబాబు, బొంతు వెంకటరమణ, మొదలగు వారు పాల్గొన్నారు.