పలువురిని పరామర్శించిన పితాని

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, తాళ్లరేవు మండలం జార్జి పేట గ్రామానికి చెందిన ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటిదగ్గర కోలుకుంటున్న నిమ్మకాయల దుర్గారావును, అదే గ్రామానికి చెందిన కోలా సత్యవతి ఇటీవల మరణించగా వారి కుమారులు చంటిని, వారి కుటుంబ సభ్యులను, అదే గ్రామానికి చెందిన గెద్దాడ శ్రీను అన్నయ్య గెద్దాడ నాగేశ్వరరావు ఇటీవల మరణించారు వారి కుమారుడు శివాజీని,వారి కుటుంబ సభ్యులను, ఐ పోలవరం మండలం పోలవరం గ్రామానికి చెందిన రాయపరెడ్డి సత్యనారాయణ ఇటీవల మరణించారు వారి కుమారులు వరప్రసాద్, ఏలేశ్వరావుని వారి కుటుంబసభ్యులను, అదే గ్రామానికి చెందిన దంగుడుబియ్యం పోలరాజు ఇటీవల మరణించారు వారి కుమారులు నాగచంద్రరావు, రాజేంద్రప్రసాద్, వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి బాబూరావు, మద్దింశెట్టి పురుషోత్తం, దూడల స్వామి, మల్లిపూడి రాజా, వంగా సీతారాం, కర్నీడి నాని, రాయుడు గోవిందు, రాయపురెడ్డి పండు, కర్నీడి మూర్తి, దంగుడుబియ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.