క్యాన్సర్ బాధితునికి పిఠాపురం జనసేన ఆర్ధికసాయం

పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన జనసైనికుడు కేధంశెట్టి మణికంఠ గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. విషయాన్ని తెలుసుకున్న కొండెవరం జనసైనికులు అందరూ 21,600/- రూపాయలను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందజేసి మణికంఠను పరామర్శించారు. జనసేన అన్ని విధాల ఆదుకుంటుందని, మెరుగైన వైద్యం కోసం ఆమె భర్త డా. మాకినీడి వీరప్రసాద్ గారి ద్వారా అందిస్తామని తెలియజేశారు. ఈ ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్క జనసైనికునికి ఆమె కృతజ్ఞతలు పేరుపేరునా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, మేడిశెట్టి కామేష్, తోట ప్రసాద్, గాది శ్రీనివాసరావు , మేడిశెట్టి సతీష్, సంఘఒ మణికంఠ, వాకాడ సుధాకర్, గాది దుర్గ శంకర్, గాది రాకేష్, మేడిశెట్టి కిషోర్, బండి వంశీ, పప్పుసెట్టి చిన్న, బండి దొర, బండి రాజు, పితాని సతీష్, పితాని లోవ రాజు, సేనాపతుల శివ, సేనాపతుల దుర్గ, బండి నాగేంద్ర, సింహాద్రి నాగు, అద్దంకి గణేష్, బొడ్డు సురి బాబు, దొడ్డి దుర్గాప్రసాద్, మెరుగు ఇజ్రాయిల్, పంతాడ దుర్గాప్రసాద్, కొండెవరం జనసైనికులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.