పోలవరం జనసేన ఆత్మీయ సమావేశం

పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, పొంగుటూరు గ్రామంలో చిర్రి బాలరాజు సమక్షంలో జనసేన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రీ బాలరాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు అందరూ కూడా పూర్తిస్థాయిలో పనిచేయాలని, జనసేన సిద్ధాంతాలు, జనసేన ఆశయాలు బలంగా జనాల్లో ముందుకు తీసుకెళ్లాలని పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించి కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని, జనసైనికులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, జనసేన పార్టీ గెలుపు కోసం అందరూ బలంగా పనిచేయాలని బాలరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రి బాలరాజు, కొయ్యలగూడెం మండలం అధ్యక్షులు తోట రవి, మండల ప్రధాన కార్యదర్శి ప్రగడ రమేష్, పొంగుటూరు జనసేన పార్టీ అధ్యక్షులు గేలం సూర్య భాస్కర్, ప్రగడ లక్ష్మన్ దొర, ప్రగడ సురేష్, వాసిరెడ్డి సుబ్బారావు, దిలీప్ సిద్దు నాయుడు, పూర్ణ, అధిక సంఖ్యలో జనసైనికులు, జనసైనికులు పాల్గొన్నారు. అలాగే గ్రామంలో జనసేనపార్టీకి సంభందించిన అడపా రమేష్‌ హార్ట్‌ ఎటాక్‌తో, మరొక జనసేన కార్యకర్త దగ్గు దుర్గారావు మరణించడంతో వారి కుటుంభ సభ్యులను పరామర్శించడం జరిగింది.