తీన్మార్ మల్లన్నను కస్టడీకి తీసుకున్న పోలీసులు

సైబర్ క్రైమ్ పోలీసులు నేడు తీన్మార్ మల్లన్నను కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో గతంలో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్నను పోలీసులు కస్టడీ కోరగా.. కోర్టు ఒక్కరోజు అనుమతిచ్చింది. దీనిలో భాగంగానే నేడు విచారించనున్నారు.