ధనలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం, గంగవరం మండలం పాత కోట గ్రామం గాలి ధనలక్ష్మి ఇటీవల స్వర్గస్దులైనారు. వారి కుమారుడు కోటేశ్వరరావుని వారి కుటుంబసభ్యులను రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ కలసి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గాలి రాము, ఏరుపల్లి వంపిటిసి సాక్షి శివకృష్ణ కుమార్, చెల్లూరి భీమేశ్వరరావు, రాంబాబు నాయుడు, పాతకోట గ్రామం జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.