భారీస్థాయిలో సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పోలిశెట్టి చంద్రశేఖర్
రామచంద్రపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 16 వ తేదీన మండపేటలో ఏర్పాటుచేసిన రైతు భరోసా యాత్ర కార్యక్రమం మండపేట టౌన్ నుండి కో ఆర్డినేట్ చేయుటకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి బోడపాటి రాజేశ్వరి లను నియమించడం జరిగింది. బుధవారం మండపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ఏర్పాటు చేసిన జనసేన నాయకుల సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ జనసేన నాయకులు, జనసైనికులతో సమావేశమయ్యి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభను ప్రజలందరకి తెలియజేయాలని భారీస్థాయిలో ఈ సభను విజయవంతం చేయాలని జనసేన నాయకులకు, జనసైనికులకు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బుంగ రాజు, కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న, తదితర మండపేట టౌన్ జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-13-at-10.00.34-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-13-at-10.02.06-PM-1024x461.jpeg)